ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి ప్రజాధన వినియోగంపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, ఆపరేషన్కు సంబంధించిన మొత్తం ఖర్చును తన వ్యక్తిగత నిధుల నుంచే చెల్లించినట్లు సమాచారం. చికిత్సతో పాటు ప్రయాణ వ్యయాలను కూడా స్వయంగా భరించారు.
సాధారణంగా మంత్రివర్గ సభ్యులకు వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించకూడదన్న తన అభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే తరహాలో గతంలో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న సమయంలో కూడా ఆయన ప్రభుత్వ నిధులను వినియోగించకుండా, సొంత నిధులతోనే చికిత్స ఖర్చులు భరించారు. తాజాగా భుజం సర్జరీ విషయంలోనూ అదే
