TGN NEWS ( కుత్బుల్లాపూర్ ) : దుండిగల్ గ్రామంలో బి.అర్.ఆర్ రిసార్ట్స్ ను ముఖ్య అతిధిగా ఐటి శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రిని భారీ గజమాలతో, డప్పు చప్పుళ్ల నడుమ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఆయనతో కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, కూన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి కొలాన్ హనుమంత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బొంగునూరు కిషోర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గbకాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
