Home తెలంగాణ హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుతో బండారు దత్తాత్రేయ భేటీ

హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుతో బండారు దత్తాత్రేయ భేటీ

3
0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా జరిగిన ఈ భేటీలో, అక్టోబర్ 22న నిర్వహించే ప్రతిష్ఠాత్మక ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని చంద్రబాబును దత్తాత్రేయ ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, ఆత్మీయతను చాటుతున్న ‘అలయ్ బలయ్’ విశిష్టతను చంద్రబాబుకు వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. దత్తాత్రేయ ఆహ్వానం పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వేడుకకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. దత్తాత్రేయ మాట్లాడుతూ, “అలయ్-బలయ్ వేదిక తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు మరియు సమాజంలోని వివిధ వర్గాల మధ్య సోదరభావాన్ని పెంపొందించే వేదిక” అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కేవలం ఆహ్వానం మాత్రమే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాల బలోపేతంపైనా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం, ఉమ్మడి ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత, పరస్పర సహకారం వంటి కీలక అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here