అమరావతి: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా జరిగాయి. రాజధాని అమరావతిలో జరిగిన వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమే అని చంద్రబాబు అన్నారు. “దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. వందేళ్ల స్వాతంత్య్ర వేడుకల నాటికి దేశం, రాష్ట్రం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఇక కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.
