TGN NEWS (జిన్నారం): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బొల్లారం మున్సిపల్ పరిధిలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆదేశాల మేరకు సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ పరిధిలో లక్ష్మి నగర్ కాలనీలో మున్సిపల్ అధ్యక్షులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీలు అఖిల్, సంతోష్, సురేందర్, మోహిత్, సురేష్, బన్నీ, ధనుంజయ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
