Home తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లపై పెద్ద అప్‌డేట్… కేంద్రం నుంచి భారీ నిధులకు ఆమోదం

ఇందిరమ్మ ఇండ్లపై పెద్ద అప్‌డేట్… కేంద్రం నుంచి భారీ నిధులకు ఆమోదం

0

సొంతింటి కల కంటున్న తెలంగాణ ప్రజలకు అదిరిపోయే వార్త అందింది! ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.0 కింద రాష్ట్రంలోని 118 పట్టణాల్లో కొత్త ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ పథకం ద్వారా వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అసలు ఈ ప్రాజెక్టు విలువ ఎంత? ఎవరెవరికి ఇళ్లు రాబోతున్నాయి? ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

18 వేల పైచిలుకు ఇళ్లకు ఆమోదం: తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. మొత్తం 118 పట్టణాల్లో 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఇక దీనివల్ల పట్టణాల్లో అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న పేదలకు సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం లభించింది.

రూ.910 కోట్ల భారీ బడ్జెట్: ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.910.65 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.5 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ నిధులతో నాణ్యమైన ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. చాలా కాలంగా నిధుల కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయింది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version