ప్రపంచ బ్యాంక్ తాజా గుర్తింపు తెలంగాణ అభివృద్ధి నమూనాపై అంతర్జాతీయ విశ్వాసానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణ 2025-26లో 5,407 అమెరికన్ డాలర్ల తలసరి ఆదాయంతో ఎగువ మధ్య-ఆదాయ రాష్ట్రాల జాబితాలో చేరడం కేసీఆర్ నాయకత్వంలో అమలైన అభివృద్ధి విధానాల ఫలితమని పేర్కొన్నారు.
పారిశ్రామిక పెట్టుబడులు, వ్యవసాయ రంగ సంస్కరణలు, సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన తెలిపారు. టీఎస్-ఐపాస్, కాళేశ్వరం, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి పథకాలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు.
తెలంగాణను ఆర్థికంగా బలహీన రాష్ట్రంగా చూపించే ప్రయత్నాలను ప్రపంచ బ్యాంక్ నివేదిక పూర్తిగా ఖండించిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన బలమైన పునాదులపై రాష్ట్రం ముందుకు సాగుతోందని కేటీఆర్ అన్నారు.
