Home తెలంగాణ తెలంగాణకు ఉపశమనం.. ఎండల నుంచి రిలీఫ్, త్వరలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

తెలంగాణకు ఉపశమనం.. ఎండల నుంచి రిలీఫ్, త్వరలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

0

గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు అధికారికంగా కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. దీంతో తెలంగాణలోనూ వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాల ప్రభావంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తుండగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వర్షాల తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయి. సాధారణంగా కేరళ నుంచి తెలంగాణకు నైరుతి రుతుపవనాలు చేరడానికి వారం రోజుల సమయం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

అయితే రుతుపవనాల ముందస్తు ప్రభావం ఇప్పటికే తెలంగాణలో కనిపించడం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతుండగా, పలుచోట్ల మేఘావృత వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు జారీ చేసిన హీట్‌వేవ్ హెచ్చరికలను ఐఎండీ వెనక్కి తీసుకుంది.

రాబోయే రోజుల్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలకు ఎండల నుంచి కొంత ఉపశమనం లభించనుంది.

మరోవైపు, ఖరీఫ్ సీజన్‌కు ముందు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉండటంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. రుతుపవనాలు రాష్ట్రంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత వర్షాల విస్తరణ మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version