Home జాతీయం జన నాయగన్’ సెన్సార్ వార్తలపై నిర్మాణ సంస్థ క్లారిటీ.. వైరల్ ప్రచారంలో నిజం లేదని వెల్లడి

జన నాయగన్’ సెన్సార్ వార్తలపై నిర్మాణ సంస్థ క్లారిటీ.. వైరల్ ప్రచారంలో నిజం లేదని వెల్లడి

0

దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’కు సంబంధించిన సెన్సార్ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పష్టత ఇచ్చింది. సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తయిందని, చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ లభించిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపింది.

ఇటీవల ‘జన నాయగన్’ జులై 23న విడుదల కానుందని, సెన్సార్ బోర్డు సభ్యులు చిత్రాన్ని వీక్షించి ఏ సర్టిఫికెట్ జారీ చేశారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ సమాచారం అధికారికం కాదని నిర్మాతలు వెల్లడించారు.

సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాను పరిశీలించిన తర్వాత కొన్ని మార్పులు సూచించారని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆ సవరణలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని పేర్కొంది. సూచించిన మార్పులు పూర్తయ్యాక సినిమాను మళ్లీ సెన్సార్ బోర్డుకు పంపనున్నట్లు వెల్లడించింది.

రీ-సెన్సార్ ప్రక్రియ పూర్తైన తర్వాతే సినిమా సర్టిఫికెట్, విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఉంటుందని నిర్మాతలు స్పష్టం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్, సాంకేతిక పనులను వేగంగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బృందం సన్నాహాలు చేస్తోందని తెలిపారు.

అభిమానులు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, చిత్ర బృందం నుంచి వచ్చే అధికారిక అప్‌డేట్ కోసం వేచి చూడాలని నిర్మాణ సంస్థ కోరింది.

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతుండటంతో ‘జన నాయగన్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version