Home జాతీయం మీనాక్షి న‌ట‌రాజన్‌పై కుట్ర చేసింది ఎవ‌రు ?

మీనాక్షి న‌ట‌రాజన్‌పై కుట్ర చేసింది ఎవ‌రు ?

0

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత లీకులా? మీనాక్షి నటరాజన్ సమన్ల వ్యవహారంపై రాజకీయ దుమారం

తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు జారీ అయిన సమన్ల వివరాలను బీజేపీకి అందించారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2025లో ఆమెపై నమోదైన క్రిమినల్ కేసు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే విచారణ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, నామినేషన్ గడువు ముగిసే వరకు వేచి చూసిన అనంతరం మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకులకు ఈ సమాచారం ఎలా చేరిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నేతలకు సైతం ముందస్తు సమాచారం లేని ఈ వ్యవహారంలో, పోలీసు శాఖలోని కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులే ఈ వివరాలను బీజేపీకి చేరవేసి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇవ్వడానికా? లేక కొందరు నేతలు బీజేపీకి చేరువ కావాలనే వ్యూహంలో భాగంగానా ఈ సమాచారం లీక్ అయిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే, ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఈ సమాచారాన్ని ఎలా సేకరించిందన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version