Home తెలంగాణ Breaking :ఓఆర్ఆర్‌పై నిలిచిన లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

Breaking :ఓఆర్ఆర్‌పై నిలిచిన లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

0

హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్‌పై నిలిచి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

ప్రమాదం తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక మహిళ, చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో లారీ ఎందుకు ఓఆర్ఆర్‌పై నిలిచింది, కారు వేగం ఎంత, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version