Home తెలంగాణ పార్టీ మార్పుపై ఊహాగానాలకు ఫుల్‌స్టాప్.. బీఆర్ఎస్‌లోనే ఉంటానన్న మల్లారెడ్డి

పార్టీ మార్పుపై ఊహాగానాలకు ఫుల్‌స్టాప్.. బీఆర్ఎస్‌లోనే ఉంటానన్న మల్లారెడ్డి

11
0

మేడ్చల్: ఇటీవల తన పార్టీ మార్పుపై సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో వస్తున్న ప్రచారాలకు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెరదించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేస్తూ, జరుగుతున్న ప్రచారం అసత్యమని కొట్టిపారేశారు.

తనకు రక్తంతో రాసిన లేఖ ఘటన ఎంతో బాధ కలిగించిందని మల్లారెడ్డి అన్నారు. ఆ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ, కార్యకర్తల అభిమానాన్ని అర్థం చేసుకుంటానని చెప్పారు.

ప్రజా సేవే తనకు ముఖ్యమని, నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసం, ఆశీర్వాదంతోనే ప్రజాసేవ కొనసాగిస్తానని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here