AP: ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఫీడ్ ధరను రూ.4 తగ్గించేందుకు ఫీడ్ యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ పట్ల ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.
