మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘అప్పలసూరి’ పాత్ర తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన పాత్రలలో ఒకటని పేర్కొన్న జగపతిబాబు, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. సినిమా విడుదల తర్వాత ఒక ప్రముఖ దర్శకుడు తనకు ఫోన్ చేసి, “ఇదే పాత్రను మరో భాష నటుడు చేసి ఉంటే మరింత గుర్తింపు వచ్చేది” అని వ్యాఖ్యానించినట్లు వెల్లడించారు.
ఇండస్ట్రీలో పరభాష నటులకు ఎక్కువ గుర్తింపు లభిస్తుందని కొందరు భావించినా, తనకు అలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. అయితే ‘పెద్ది’ కోసం తాను చేసిన కృషికి తగిన గుర్తింపు రావాలని ఆశించడం సహజమేనని అన్నారు.
ఇక హీరోయిన్ జాన్వీ కపూర్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ను జగపతిబాబు ఖండించారు. “జాన్వీ తన పాత్రను దర్శకుడు చెప్పిన విధంగానే చేసింది. ఒక పాత్ర ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కానీ అందుకు నటిని వ్యక్తిగతంగా విమర్శించడం సరైంది కాదు. కళాకారులను మానసికంగా ఇబ్బంది పెట్టేలా ట్రోల్ చేయడం మంచిది కాదు” అని ఆయన స్పష్టం చేశారు.
