Home తెలంగాణ క్లాస్ రూమ్.. కనిపించిన సీన్ చూసి విద్యార్థుల పరుగో.. పరుగు!

క్లాస్ రూమ్.. కనిపించిన సీన్ చూసి విద్యార్థుల పరుగో.. పరుగు!

0

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పొలుమళ్ల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం (జూలై 06) ఉదయం పాములు ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తరగతి గదిలో ఒకేసారి మూడు పాము పిల్లలు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా తరగతి గదుల నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం పాములను జాగ్రత్తగా అక్కడి నుంచి తరిమివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల ఆవరణలో పొదలు, చెత్త పేరుకుపోవడం లేదా వర్షాకాలం కారణంగా పాములు తరగతి గదుల్లోకి వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాల పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు, పాములు వంటి విషజంతువులు పాఠశాల ఆవరణలోకి రాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version