అధిక జ్యేష్ఠ మాసం కారణంగా గత కొన్ని వారాలుగా నిలిచిపోయిన వివాహాలు, ఇతర శుభకార్యాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. శూన్య మాసాల ప్రభావం ముగియడంతో జూన్ 16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో శుభ ముహూర్తాల సందడి మొదలైంది. నిజ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి ప్రారంభమైన నేపథ్యంలో జులై 12 వరకు వరుసగా శక్తివంతమైన సుముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు వెల్లడించారు. దీంతో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు తదితర శుభకార్యాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.