Home ఆంధ్రప్రదేశ్ తిరుమలలో భక్తుల వెల్లువ.. దర్శనానికి 20 గంటల నిరీక్షణ

తిరుమలలో భక్తుల వెల్లువ.. దర్శనానికి 20 గంటల నిరీక్షణ

0

వారాంతం కావడంతో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిశాయి. దేశం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై తీవ్ర రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, క్యూలైన్లు వెలుపలికి విస్తరించాయి.

ప్రస్తుతం టోకెన్లు లేని సాధారణ సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు కాలినడక మార్గాలు, బయట రింగు రోడ్డు వరకు ఉన్న క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు నిరంతరం పాలు, తాగునీరు, అల్పాహారం అందజేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఇక శుక్రవారం ఒక్కరోజే 68,374 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 35,241 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.03 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తమ ప్రయాణాన్ని, దర్శనాన్ని తగిన జాగ్రత్తలతో ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version