TGN News (కుత్బుల్లాపూర్) : నియోజకవర్గంలోని గణేష్ హౌసింగ్ కాలనీలో టీమ్ స్టెప్ అఫ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో దుర్గామాత శరనవరత్రుల్లో భాగంగా అమ్మవారి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జైశంకర్ గౌడ్ పాల్గొని భక్తజనులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అన్నదానం అత్యంత పుణ్యకార్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అలాగే జీడిమెట్ల డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షులు పులి బలరాం, అర్జున్, లక్ష్మణ్, మనిష్, తేజ, హరి, నాయుడు, కాలనీ వాసులు తదితరులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.



