TGN NEWS (వెల్దుర్తి): మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తుందని ఆయన అన్నారు. గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారుల నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో బలరాం రెడ్డి పాల్గొన్నారు.



