సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు మహేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బి జె ఎం సి జాతీయ చైర్మన్ బిశ్వప్రియ రాయి చౌదరి, జాతీయ అధ్యక్షులు ఆర్నాబ్ చాటర్జీ, జాతీయ కార్యదర్శి ప్రశాంత్, జాతీయ యువ అధ్యక్షులు దీపక్ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున, రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖాళీఫాతుల్లా భాష, రాష్ట్ర ఉపాధ్యక్షులు సివిబి రెడ్డి, హైదరాబాద్ అధ్యక్షురాలు శ్రీదేవి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు మహేందర్ మాట్లాడుతూ కార్మిక సమస్యలను పరిష్కరించడం మరియు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తానని. BJMC అనేది బిజెపిలో ఒక ముఖ్యమైన సంస్థ, ఇది కార్మిక సంక్షేమం మరియు కార్మికుల హక్కులపై పోరాడుతుందని అన్నారు.రాష్ట్రంలో కార్మికుల హక్కులను ప్రోత్సహించడానికి మరియు కార్మిక సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు.
