-
1.35 కేజీ ఎండు గంజాయి స్వాధీనం…
TGN NEWS (మనోహరాబాద్): అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నారూ అనే సమాచారం మేరకు దాడులు నిర్వహించి వారికి గుర్తించి ఒక కిలో 35 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ అధికారులు గోపాల్ తెలిపారు. వివరాల ప్రకారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలో ఎండు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు సీఐ గోపాల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి బీహార్ రాష్ట్రానికి చెందిన ముఖేష్ కుమార్ లు పట్టుకొని విచారించగా ఒక కిలో 35 గ్రాముల ఎండు గంజాయి సాధనం చేసుకున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి అమ్మిన కొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.






