TGN NEWS ( నర్సాపూర్ ): సంక్షేమం కోసం ప్రజాపాలన ప్రభుత్వం పని చేస్తుందని మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు బుధవారం నర్సాపూర్ లో ఇసుక బజార్ ను ప్రారంభించారు అనంతరం వైకుంఠధామానికి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లబ్ధిదారులకు ఇబ్బందులు పడకుండా తక్కువ ధరకే ఇసుక బజార్ ద్వారా ఇసుకను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అదనపు కలెక్టర్ నగేష్ ఆర్డీవో మైపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి తాసిల్దార్ శ్రీనివాస్ మైనింగ్ శాఖ అధికారులు నాయకులు పాల్గొన్నారు
