Home తెలంగాణ కొల్చారం మండల వ్యాప్తంగా ఘనంగా ప్రజా పాలన దినోత్సవం 

కొల్చారం మండల వ్యాప్తంగా ఘనంగా ప్రజా పాలన దినోత్సవం 

196
0
  • జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన అధికారులు

TGN NEWS (కూల్చారం): కొల్చారం మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలనా దినోత్సవం పురస్కరించుకొని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ ,మండలకేంద్రంలో పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ శ్రీనివాస్ చారి ,ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఎంపీడీవో ఉన్నిసా బేగం ,వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో శ్వేతకుమారి, ఆయా గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు , ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు .ఈ కార్యక్రమంలో రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం ,డైరెక్టర్ దుర్గేష్ గౌడ్, రమేష్, సంగమేశ్వర్, గంగయ్య, సాయిలు, జనార్ధన్ ,సిబ్బంది నవీన్, శ్రీనివాస్, దుర్గ రాములు, సిద్ధూ ,బిక్షపతి ,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here